అవుట్సోర్సింగ్ స్కాం సంచలనం: 7 వేల మంది అధికారులపై ఆరోపణలు
తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల వ్యవస్థపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఫారెన్సిక్ ఆడిట్ ద్వారా సుమారు 7 వేల మంది అధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లతో జీతాలు తీసుకున్నట్టు సమాచారం బయటకు రావడం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో కొంతమంది రెగ్యులర్ అధికారులు డమ్మీ అకౌంట్లు సృష్టించి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంటే రెగ్యులర్ జీతంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లపై కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది….

