రైతు సమస్యల్లో కాంగ్రెస్ పాలన విఫలం: బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు
సిద్దిపేట్ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు రైతు సమస్యలపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ₹8,000 మద్దతు ధర (MSP) ప్రకారం రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించుకోవాలని, మధ్యదళారుల చేత మోసపోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు పిలుపునిచ్చారు. దేశంలో పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో ప్రతి సంవత్సరం భారీగా దిగుమతులు చేయాల్సి వస్తోందని…

