రేవంత్ రెడ్డి నిశ్శబ్దం ఎందుకు? — కృష్ణా నీళ్లపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం ఎక్కడ?

తెలంగాణ జలవనరులపై మళ్లీ చర్చ మొదలైంది. కృష్ణా నదీ జలాల పంపిణీపై కర్ణాటక, మహారాష్ట్ర స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం “మేము 112 టీఎంసీల కృష్ణా నీటిని ఆపుకుంటాం” అని కేంద్రానికి లేఖ రాయగా, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా “మాకు వరద జలాలపై ప్రాజెక్టులు కట్టుకునే హక్కు ఇవ్వాలి. నియమ నిబంధనలు వర్తిస్తే మేమూ కట్టుతాం” అని స్పష్టం చేసింది. దీనితో రెండు…

Read More

కృష్ణా, గోదావరి జలాలపై కర్ణాటక-మహారాష్ట్ర కదలికలు: తెలంగాణ నష్టపోతుందా?

తెలంగాణకు జలవనరుల పరంగా మరొక సవాలు ఎదురవుతోంది. కృష్ణా నదీ జలాలపై కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కదలికలు వేగంగా జరుగుతుండగా, తెలంగాణ మాత్రం “నిమ్మకు నీరెత్తినట్లు” చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి, “మేము పైప్రవాహం నుంచి 112 టీఎంసీల కృష్ణా నీళ్లను ఆపేస్తాం” అని స్పష్టం చేసింది. ఈ లేఖ కేవలం హెచ్చరిక కాదని, నీటి వినియోగంపై గట్టి నిర్ణయ సంకేతమని జలవనరుల నిపుణులు చెబుతున్నారు….

Read More