ఫోన్ ట్యాపింగ్ నుంచి టెండర్ స్కామ్ వరకు: కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆరోపణలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. “మేము భయపడే వాళ్లం కాదు, కొట్లాడతాం… కొట్లాడి మళ్లీ పునీతంగా బయటికి వస్తాం” అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణిలో టెండర్ల పేరుతో భారీ దందా ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఈ అక్రమాలు మొదలయ్యాయని, ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్కు ఎంక్వైరీ డేట్…

