ఈవీ పాలసీతో తెలంగాణ రోల్ మోడల్: 100% టాక్స్ మినహాయింపు, 900 కోట్ల ఆదాయ నష్టం అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
రాబోయే తరానికి కాలుష్య రహిత భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 41 ద్వారా ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) పాలసీని తీసుకొచ్చిందని అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరంలోనే లక్షకు పైగా ఈవీ వాహనాలు అమ్ముడైనట్లు సభకు తెలియజేశారు. ఈవీ వాహనాల కొనుగోలుపై 100 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి సుమారు రూ.900 కోట్ల…

