జూబ్లీహిల్స్ బరిలో ఆఖరి అరగంట — మందకొడిగా సాగుతున్న ఓటింగ్, ఆశించిన పోలింగ్ శాతం రాకపోవడంతో ఆందోళన
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ ముగియడానికి మరో అరగంట సమయం మాత్రమే మిగిలి ఉండగా, అధికారులు చివరి నిమిషం వరకు ఓటు వేయాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇంతవరకు మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. అయినప్పటికీ ఈ గణాంకం ఎన్నికల వేడిలో పెద్దగా పెరుగకపోవడం రాజకీయ…

