మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్కా సుమన్ దాడి ఆరోపణలు… కేతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మరియు ఆయన అనుచరులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మంత్రి వాహనంపై ట్రాఫిక్ కోన్ విసిరేయడం, అనంతరం రాళ్ల దాడులు జరగడంతో ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు….

