జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటు చోరికి పాల్పడుతోందా? బీఆర్ఎస్ నేతల ఆరోపణలు తీవ్రం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. “ఇయాల జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికీ బైబై ఎలక్షన్ అవుతుంది” అంటూ పార్టీ నాయకులు తెలిపారు. వారిచే వెల్లడించిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి 20–30 వేల దొంగ ఓట్లు నమోదు చేయించుకున్నారని, ఒకే ఇంట్లో 50 నుండి 70 ఓట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా బయటపెట్టామని బీఆర్ఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. “246, 251, 253 బూత్లలోనే అనేక అనుమానాస్పద…

