ఓయులో ఉద్రిక్తత: విద్యార్థుల నిరసనలు, పోలీస్ బందోబస్తు, ఉద్యోగాలపై ప్రశ్నలు
ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం పర్యటన సందర్భంగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఆరు నెలల క్రితం “ఎవరు నిరసన చేసినా ఆపకండి, పోలీస్ బందోబస్తు అవసరం లేదు, నేను ప్రజల ప్రశ్నలకు సమాధానం చెబుతాను” అని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఈసారి మాత్రం వేలాది మంది పోలీసులతో ఓయుకు రావడం విద్యార్థుల్లో అసంతృప్తిని రేపింది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వినకుండా కేవలం ముందుగా రాసుకొచ్చిన ప్రసంగం చదివి వెళ్లిపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. సమస్యలపై మాట్లాడే…

