బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ నేతల డిమాండ్

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ నాయకులు కోరుతున్నారు.

ఓకే టీవీతో మాట్లాడిన బీసీ నేత వెంకన్న మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు మాటలు మాత్రమే ఇస్తున్నాయని, కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ మరియు బీజేపీ బీసీలకు న్యాయం చేస్తామని చెబుతున్నప్పటికీ, అసలు రిజర్వేషన్లు అమలులో పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మెమొరాండం కార్యక్రమాలు, భారీ బీసీ సభలు, అలాగే కామారెడ్డిలో పెద్ద స్థాయి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధనలో అన్ని బీసీ సంఘాలను భాగస్వాములుగా ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *