జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ నాయకులతో జరిగిన సమావేశంలో స్థానిక నాయకురాలు భావోద్వేగంతో మాట్లాడారు. పార్టీలో గడించిన రోజులను గుర్తుచేసుకుంటూ, మాజీ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు గోపన్న (గోపీనాథ్) సేవలను వివరించారు. మహిళలకు ఎల్లప్పుడూ అండగా నిలబడి, కష్టసమయంలో అర్థరాత్రైనా ప్రజల మధ్యకు వచ్చి సమస్యలను పరిష్కరించిన నాయకుడని ఆమె ప్రశంసించారు.
“నన్ను మీ ఇంటి ఆడబిడ్డలా చూసి, ఇప్పటికీ అండగా నిలబడ్డందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా నాకు మీ అండదండలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను,” అంటూ ఆమె భావోద్వేగంగా చెప్పారు.
జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎప్పటికీ వారి కోసం నిలబడుతుందని హామీ ఇచ్చారు. ప్రజల మద్దతు, పార్టీ బలం, నాయకత్వం నమ్మకంతో ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు. చివరిగా “జై కెసిఆర్, జై తెలంగాణ, జై గోపన్న” అంటూ నినాదాలు చేశారు

