మహిళా భద్రతపై ఘాటైన స్పందన – “ధైర్యంగా నిలబడండి, న్యాయం అందుకునే వరకు పోరాడండి

హైదరాబాద్‌లో మహిళా భద్రత అంశంపై ఘాటైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. నగర మహిళా భద్రత విభాగంపై సజ్జనార్ గారి సమీక్ష సందర్భంగా మాట్లాడిన ఓ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“ఆడపిల్లల జోలికి వస్తే హిస్టరీ షీట్స్ తప్పవు. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. సజ్జనార్ గారు యూనిఫార్మ్ వేసుకున్నాక ఆడపిల్లలకు ధైర్యం వచ్చింది” అని అన్నారు.

సమాజంలో ఉన్న అసమానతలపై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెద్దోడైతే బయటపడతాడు, సామాన్యుడు అయితే జైలుకి వెళ్తాడు. ఇదే పరిస్థితి ఎందుకు?” అని ప్రశ్నించారు. కొన్ని ఐఏఎస్ అధికారులు మహిళలను వేధిస్తున్నారని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక ఆత్మహత్య చేసుకున్న గర్భిణి మహిళ ఘటనపై మాట్లాడుతూ, “ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, టార్చర్ అనుభవిస్తే బయటికి వచ్చి చెప్పాలి. ప్రాణం పోతే పరువు ఏమి పనికివస్తుంది?” అని చెప్పారు.

సమాజంలోని తల్లిదండ్రులు, మీడియా, మరియు అధికార యంత్రాంగం మహిళలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. “ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి — సోషల్ మీడియా, మీడియా… వీటిని ఉపయోగించండి. నిజంగా పని చేసే మీడియా ఈ అంశాలపై డిబేట్ పెట్టాలి, సెలబ్రిటీ గాసిప్స్‌ మీద కాదు” అని స్పష్టంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *