మహాశివరాత్రి సందర్భంగా ధర్మగిరి దేవాలయంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. దేవుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటన శంషాబాద్లో చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఇద్దరు యువకులు “డిఫరెంట్ ప్రసాదం” అంటూ గంజాయిని శివుడి ముందు ఉంచి వీడియో తీశారు. ఆ వీడియోను Instagramలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.
వీడియో విషయం సి.వి. సజ్జనార్ దృష్టికి చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. దేవాలయాల్లో మాదక ద్రవ్యాలతో రీల్స్ చేయడం సహించబోమని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వీడియో విషయం సి.వి. సజ్జనార్ దృష్టికి చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. దేవాలయాల్లో మాదక ద్రవ్యాలతో రీల్స్ చేయడం సహించబోమని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీంతో వెంటనే చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారిని ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు అప్పగించి కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో రీల్స్ కోసం యువత చేసే ప్రమాదకర, బాధ్యతారహిత చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో గంజాయి సులభంగా అందుబాటులోకి వస్తోందా అనే ప్రశ్నలు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి.
వైరల్ కావాలనే తపనతో మత భావాలను అవమానించే చర్యలకు దిగడం సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

