భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ పర్యటనలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కేరళలోని కొచ్చి ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్రపతి గారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే సమయంలో, వారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్య ఎదురైంది.
వివరాల ప్రకారం, హెలికాప్టర్ కొచ్చిలోని ఒక స్టేడియం లో ల్యాండ్ అవుతుండగా, భారీ వర్షాల కారణంగా నేల బురదతో కప్పబడింది. బురదలో హెలికాప్టర్ టైర్లు ఇరుక్కుపోయి, హెలికాప్టర్ ఒక వైపు ఒరిగే ప్రమాదం ఏర్పడింది. దీని వల్ల కొన్ని నిమిషాల పాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సిత్తి అతి త్వరగా స్పందించిన రాష్ట్రపతి భద్రతా సిబ్బంది, పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది, కలిసి హెలికాప్టర్ను బురద నుంచి నెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సంఘటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఎలాంటి హాని లేకపోవడంతో, భద్రతా సిబ్బంది మాత్రమే కాదు, దేశ ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హెలికాప్టర్ సురక్షితంగా బయటకు తీసిన తర్వాత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయలుదేరారు. ఈ సంఘటన భద్రతా ఏర్పాట్లపై మరింత సమీక్ష అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

