ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆపండి, పాలనపై దృష్టి పెట్టండి: కేటీఆర్–హరీష్ రావులకు మద్దతుగా బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా గమనిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, విలువైన కాలాన్ని విచారణలు, నోటీసులు, రాజకీయ డ్రామాలతో ప్రభుత్వం వృథా చేస్తోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చిన తరువాత, తదుపరి కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం సాగుతోందని, ఇది పూర్తిగా భయభ్రాంతులు సృష్టించడానికి చేసిన ప్రయత్నమేనని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పేరిట…

Read More

ఫోన్ ట్యాపింగ్, సింగరేణి స్కామ్, విచారణల పేరిట రాజకీయ దాడులు: బిఆర్ఎస్ నేతల తీవ్ర ఆరోపణలు

భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ ప్రభుత్వ దాకా గూఢచారి, నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు నిఘా వ్యవస్థలు అవసరమేనని, అయితే వాటిని రాజకీయ కక్ష సాధింపుకు వాడటం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి 50 లక్షల రూపాయలతో వచ్చిన వ్యక్తి పట్టుబడ్డ…

Read More

ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో రాజకీయ కక్షలు: కేసీఆర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కుట్రలా?

ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. సిట్ విచారణ పేరుతో వరుసగా బిఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ కావడం, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణకు పిలవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ విచారణలు నిజమైన న్యాయ ప్రక్రియలో భాగమా? లేక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడులను లెక్కచేయకుండా రాజీ లేని…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును సుమారు ఏడు గంటల పాటు విచారించిన సిట్, తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కేటీఆర్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆయన కూడా ఊహించని కీలక సాక్ష్యాలను…

Read More

42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలేంటి? రేవంత్ రెడ్డి హామీలపై బీసీ రాజకీయ ఫ్రంట్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. బీసీ రాజకీయ ఫ్రంట్ ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండానే మున్సిపల్…

Read More

ఆత్మభిమానం ఎక్కడ పోయింది? పాపపు సొమ్ముతో పాలన చేస్తారా? కళ్యాణలక్ష్మి – తులం బంగారం ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేసిన ప్రభుత్వం

ఇట్లా మాత్రం లేదు ఆత్మభిమానం” అన్న మాటే ఈ ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆవేదనకు ప్రతీకగా మారింది. ప్రజలు కష్టపడి కట్టే పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. ఆ డబ్బు పరుల సొమ్ము కాదు – ప్రజల సొమ్ము, దాన్ని ప్రజలకే సేవల రూపంలో తిరిగి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సేవలు అంటే చేతిలో చీపురు కట్ట పట్టుకుని రోడ్లు ఊడమడమే కాదు. ప్రజలు కట్టే టాక్సులకు సరైన విలువ రావాలి. ఆసుపత్రుల్లో చికిత్స, పేదల…

Read More

పెట్టుబడుల పేరుతో భూముల దోపిడీ? రేవంత్ రెడ్డి – శ్రీధర్ బాబు – పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు

దావోస్ పెట్టుబడులు ఎక్కడ? 80 వేల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు – రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణ ప్రభుత్వం మరోసారి దావోస్ పర్యటన పేరుతో భారీ ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, అధికారులు, ప్రముఖులతో కలిసి ప్రపంచ ఆర్థిక వేదికకు వెళ్లి ఈసారి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటూ ప్రకటనలు ఇస్తోంది. అయితే ప్రజల మధ్య ఒకే ప్రశ్న వినిపిస్తోంది – గతంలో ప్రకటించిన…

Read More

డ్రైవింగ్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్: వికారాబాద్ పోలీసుల అవగాహన కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, బైక్ డ్రైవర్లు సహా అన్ని రకాల వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, ఆటోలలో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వివరించారు. ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల…

Read More

42% బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు అన్యాయం: బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇంకా పూర్తి స్థాయిలో అమలుకాని పరిస్థితిలోనే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారంలోకి రాకముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేయలేదని బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరుగుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ, కనీసం ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే కూడా 42…

Read More

హైదరాబాద్‌లో ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన: 2017 నుంచి పెండింగ్ ఉన్న బెనిఫిట్స్ కోసం రోడ్లపై ధర్నా

హైదరాబాద్‌లో బస్ భవన్ ముందు దాదాపు 10,000 మంది ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రస్తుత ప్రభుత్వం, ఆర్టీసి మేనేజ్‌మెంట్ నుండి స్పష్టమైన సమాధానం అందకపోవడం కారణంగా రోడ్లపైకి వచ్చారు. వీరి ప్రధాన డిమాండ్స్‌లో పే స్కేల్, పిఆర్సి (PRC Arrears), గ్రాడ్యుయిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ ఉన్నాయి. 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల కోసం బెనిఫిట్స్ ఇప్పటి వరకు విడుదల చేయబడలేదు….

Read More