News
ముచ్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితో తెలంగాణ బహుజన పోరాటం – 42 శాతం బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు అన్యాయం
తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, సేవలను పార్టీ రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి నేత స్పష్టం చేశారు. గత సంవత్సరం విచార కిరీటం పుస్తకం చదివిన సందర్భంగా, తాను అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఉద్యమకారుల జయంతిని సామాజిక మాధ్యమాల్లో గుర్తు చేసుకున్నానని తెలిపారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారన్నది ముఖ్యం కాదని, తెలంగాణ ఫస్ట్ అనే విధానంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి గొప్పతనాన్ని గుర్తించాల్సిందేనని…
10వ తరగతి పరీక్షలకుముందే అడ్మిషన్ల దందా: డిస్కౌంట్ల పేరుతో తల్లిదండ్రులపై కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి
10వ తరగతి వార్షిక పరీక్షలు ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్ల దందా జోరుగా సాగుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు “హలో సార్… మీ పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడా?” అంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, భారీ డిస్కౌంట్లు, ఫీజు రాయితీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా విద్యా సంవత్సరం ముగియకముందే, 2026–27 విద్యా సంవత్సరానికి ఆరు నెలల సమయం ఉండగానే అడ్మిషన్లు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇంటర్…
ట్రాఫిక్ చలాన్ల వసూలులో బలవంతం నిషేధం: వాహన తాళాలు లాక్కునే హక్కు పోలీసులకు లేదు – హైకోర్టు
ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని, చలాన్ల వసూలు కోసం వాహనాలను అడ్డుకోవడం లేదా వాహనాల తాళం చెవులు లాక్కునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా చెల్లించకపోతే, చట్ట ప్రకారం సంబంధిత కోర్టు ద్వారా మాత్రమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలాన్లు చెల్లిస్తే…
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో: ప్రచారం ప్రారంభించామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో వెలువడే అవకాశం ఉందని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్ విడుదల కావొచ్చని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం, ఆలేరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచే ప్రారంభించామని…
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై కాంగ్రెస్ విమర్శలు: “పోరాట యోధుడిలా నటిస్తున్నారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు పిలిస్తే ఏదో పెద్ద పోరాట యోధుడిలా హరీష్ రావు ఫీల్ అవుతున్నారని, పదేళ్ల పాటు నీచంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ధ్వజమెత్తారు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశాడని స్వయంగా కవిత గారే చెప్పారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల…
సినిమా టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు సీరియస్: సివి ఆనంద్కు ధిక్కరణ నోటీసులు, 90 రోజుల నిబంధన తప్పనిసరి
సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి ముందుగా తీసుకురాకపోవడంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో, ఎనిమిదవ తేదీన మన శంకర్ వరప్రసాద్ సినిమా…
ఫోన్ ట్యాపింగ్ నుంచి టెండర్ స్కామ్ వరకు: కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆరోపణలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. “మేము భయపడే వాళ్లం కాదు, కొట్లాడతాం… కొట్లాడి మళ్లీ పునీతంగా బయటికి వస్తాం” అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణిలో టెండర్ల పేరుతో భారీ దందా ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఈ అక్రమాలు మొదలయ్యాయని, ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్కు ఎంక్వైరీ డేట్…
టెండర్ రింగ్ ముఠా, ఫోన్ ట్యాపింగ్ లీకులు: కాంగ్రెస్ పాలనలో బయటపడుతున్న దోపిడీ రాజకీయాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా సింగరేణి సంస్థలో టెండర్ల పేరుతో జరిగిన అక్రమాలపై తాజాగా సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 2024 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఈ దందా ప్రారంభమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్కు ఎంక్వైరీ డేట్ పెట్టగా, ఆ సమయంలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన లేకపోవడంతో టెండర్…
ప్రభుత్వ వైఫల్యం – ప్రతిపక్ష నిశ్శబ్దం: మధ్యలో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలు
తెలంగాణలో పెన్షన్లు, నిరుద్యోగం, ప్రతిపక్ష వైఫల్యం – ఇదంతా డైవర్షనా? తెలంగాణ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడమే ఇప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నా, వాటిపై ప్రభుత్వం గానీ, మీడియా గానీ సరైన స్థాయిలో మాట్లాడటం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు – చరిత్రలో ఎప్పుడైనా చూశామా? దేశంలోని చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు ఇస్తున్నారు. కానీ…
దావోస్ ఫోటోలు… ఖర్చుల బిల్లులు తప్ప పెట్టుబడులు ఎక్కడ రేవంత్ అన్న?
ప్రజా సమస్యలకన్నా ఫోటోలు, ఫ్లైట్లు ముఖ్యం అయితే దావోస్ ఎందుకు? గతంలో రేవంత్ రెడ్డి గారు ఇతరులపై మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయన్నే ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు “హిమాంశని వేసుకొని తిరుగుతున్నాడు” అంటూ విమర్శించిన రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రిగా తన మనవడిని ఎక్కించుకొని మురిసిపోతూ కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు. కానీ అదే వ్యక్తి గతంలో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటే ప్రశ్నలు రావడం సహజం. ప్రతి కార్యక్రమానికి అమ్మవారి బ్లెస్సింగ్స్ పేరుతో మనవడిని…

