News
వ్యాఖ్యలకే యూఏపీఏనా..? ఎన్నయ్య గారి అరెస్ట్పై రాజ్యాంగ హక్కుల ప్రశ్న
కేవలం వ్యాఖ్యలు చేసినందుకే యూఏపీఏ వంటి కఠినమైన చట్టాన్ని ప్రయోగించడమా..? ఇదే ఇప్పుడు ప్రజాస్వామ్య వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఎన్నయ్య గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పలువురు రాజ్యాంగ హక్కులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎన్నయ్య గారిపై యూఏపీఏ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందని సమాచారం. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం 15 రోజుల రిమాండ్ విధించారు. అయితే యూఏపీఏ చట్టం అనేది దేశంలో ఉన్న…
కృష్ణ–గోదావరి జలాలపై సభలోనే చర్చకు సిద్ధం: కేసీఆర్కు ఓపెన్ ఛాలెంజ్, పాలమూరు–రంగారెడ్డిపై ప్రజా ఉద్యమానికి బిఆర్ఎస్ సంకేతం
2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ పూర్తిగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని, అయినా ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న నేపథ్యంలో, దీనిపై బిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ రాజకీయాల్లో లేరని కాదు, ఎమ్మెల్యేగా ఉన్నా ఉపయోగం లేదన్న భావనతో తీర్పు ఇచ్చారని…
వికారాబాద్లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా
వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…
రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్ను ప్రశ్నించారు. కృష్ణా…
పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే: కేసీఆర్ ధీమాబీజేపీ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణుల్లో కౌంటర్ రాజకీయాలు
పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే గెలుపు ఖచ్చితంగా తమదేనని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బిఆర్ఎస్ వైపే ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ ఎల్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొని పార్టీ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, రాబోయే రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చ…
చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్
చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు నీళ్ల…
తెలంగాణ ఉద్యమకారుడు గాధ ఇన్నయ్య అరెస్ట్.. వాక్ స్వేచ్ఛపై దాడి అంటూ తీవ్ర విమర్శలు
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు నేత గాధ ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. జంగామ జిల్లా జఫర్గడ్ మండలం రేగడి తాండా పరిధిలోని “మా ఇల్లు – ప్రజాధరణ ఆశ్రమం” నుంచి ఆదివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ పోలీసులు, మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల…
అమీన్పూర్ ల్యాండ్ కబ్జాలపై సంచలన ఆరోపణలు: హైడ్రా బుల్డోజర్ల తర్వాత కూడా కడీలు… శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
అమీన్పూర్ (పటాన్చెరు నియోజకవర్గం)లో భూ కబ్జాల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పాటైన హైడ్రా (HYDRA) పదేపదే బుల్డోజర్ చర్యలు చేపడుతున్నా, అదే స్థలంలో మళ్లీ కబ్జాలు జరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. అమీన్పూర్ హెచ్ఎంటీ కాలనీలో కాటసాని రాంభూపాల్, సిస్లా రమేష్, సిస్లా లోహిత్ కలిసి ప్లాట్లను అక్రమంగా ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఇప్పటివరకు…
పవన్ కళ్యాణ్ నా గురువు.. ఆయనను అలా చూడాలనుకునేదాన్ని: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
ఆ స్టార్ హీరోపై సమంత ఆసక్తికర కామెంట్స్..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత.. ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. విడిపోయిన తర్వాత అటు సమంత , ఇటు నాగచైతన్య ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిన విషయం తెలిసిందే. ఆ…
కేసీఆర్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. బిఆర్ఎస్–బీజేపీ పొత్తుపై ఊహాగానాలకు బలం?
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన తరఫున ప్రత్యేకంగా చెప్పాలని బిఆర్ఎస్ ఎంపీలకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దిక్కొండ దామోదర్ రావు శుక్రవారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని…

