తెలంగాణ బీజేపీ పతనం: పార్టీ మార్పులు, నిర్లక్ష్యం, నమ్మకం కోల్పోయిన నాయకత్వం

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన పార్టీ, ఇప్పుడు అంతర్గత నిర్లక్ష్యం, నాయకత్వ వైఫల్యంతో తన స్థానం తానే కోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, బీజేపీలో చేరిన తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు, పదవులు రాకపోవడంతో తిరిగి సొంత గూటికే వెళ్లాలని…

Read More

టీవీ డిబేట్‌లో అవమానం: యాంకర్ తీరు హృదయాన్ని కలిచేసిందన్న నేత

తనపై జరుగుతున్న విష ప్రచారాలు, పిచ్చి రాతలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రముఖ రాజకీయ నేత. ఇటీవల జరిగిన టీవీ డిబేట్‌లో తనను అతిథిగా కూడా గౌరవించకుండా, తాను జూమ్ ద్వారా పాల్గొంటున్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా, “Get out from my debate” అంటూ పదే పదే అవమానించిన తీరు తన హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. తాను ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక కీలక పార్టీకి జనరల్ సెక్రటరీగా, ప్రజల చేత ఎన్నికైన…

Read More

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ – యువతను క్రీడల వైపు ప్రోత్సహించిన నిర్వాహకులు

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా శారీరక, మానసిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీ గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ టోర్నమెంట్‌కు స్పాన్సర్‌గా నిలిచిన అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన జట్లకు, రన్నర్స్‌గా నిలిచిన మల్లాపూర్ తోట జట్టుకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని…

Read More

సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరీలో కాంగ్రెస్‌లో కలకలం: నలుగురు మంత్రుల అత్యవసర భేటీ వెనుక అసలు కథ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పుడు బయటపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా, పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నలుగురు కీలక మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. సోమవారం ‘ఎట్ హోమ్’ విందు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు…

Read More

ప్రశ్నిస్తే సిట్ నోటీసులేనా? ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: హరీష్ రావు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా, రాష్ట్రంలో నలుగురు కీలక కాంగ్రెస్ మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నట్లు సమాచారం. సుమారు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ…

Read More

ప్రశ్నిస్తే సిట్ నోటీసులేనా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి: హరీష్ రావు విమర్శ

రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినిపిస్తే సిట్ నోటీసులు పంపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం సిద్ధిపేటలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని, తెలంగాణను ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దితే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందంటూ పిచ్చి ప్రచారం చేసి…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జన సమితి తీవ్ర అసంతృప్తి: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తమ పార్టీ నేతలు, కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని కోదండరాం వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ముగింపు పలకడం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను…

Read More

సంక్షోభంలో బీసీ సంక్షేమం: హామీలకే పరిమితమైన కాంగ్రెస్ పాలన

తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా బీసీల కోసం ఒక్క కొత్త పథకం కూడా ప్రకటించని కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం నిలిపివేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటాయింపులు కాగితాలపై మాత్రమే కనిపిస్తున్నాయని, కానీ నిధుల విడుదల మాత్రం పూర్తిగా శూన్యమని బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలు ఇచ్చిన…

Read More

హార్వార్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి తరగతులు: ప్రభుత్వ టూరా? వ్యక్తిగత కోర్సా? స్పష్టత కోరుతున్న రాజకీయ వర్గాలు

అమెరికాలోని ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి రోజు పరిచయ సమావేశాలు నిర్వహించగా, “21వ శతాబ్దంలో నాయకత్వం” అనే కోర్సులో భాగంగా అధికార విశ్లేషణ, నాయకత్వ అంశాలపై మొదటి సెషన్ జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు తరగతులు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ఈ కోర్సులో…

Read More

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం: నేడు వీడియో కాన్ఫరెన్స్, వచ్చే నెల రెండో వారంలో పోలింగ్

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. షెడ్యూల్ విడుదలకు ముందు నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్ శాఖ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల అనంతరం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం….

Read More