అఖండా 2 కోసం తమన్ స్పెషల్ ప్లాన్ – ఇద్దరు పండితులతో కలిసి బిగ్ మ్యూజికల్ మేజిక్ సిద్ధం!

టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన సంగీతం ఉన్న సినిమాలు రాకముందే హడావుడి చేస్తుంటాయి. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తమన్ ఇద్దరు ప్రసిద్ధ పండితులు — శ్రావణ్ మిశ్ర మరియు అతుల్ మిశ్రలతో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో చూసిన నెటిజన్లు, “ఇది అఖండా 2 కోసం ప్రత్యేకంగా చేస్తున్న ప్లాన్ అయి ఉండొచ్చు” అని ఊహిస్తున్నారు.

తమన్ ఇప్పటికే బాలకృష్ణ నటించిన అఖండా సినిమాకు అందించిన సంగీతంతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఆ సినిమా విజయానికి ఆయన సంగీతం ప్రధాన కారణంగా నిలిచింది. ఇప్పుడు అఖండా 2 కోసం అందరికీ మించి సౌండ్ అనుభవం ఇవ్వాలని తమన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

నెటిజన్లు మాట్లాడుతూ, “తమన్ ఈసారి థియేటర్స్ తగలబడిపోతాయి, స్పీకర్స్ పగిలిపోతాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాక, ఈ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.

ఇప్పుడు అఖండా 2 కోసం ఆయన ఎలాంటి మ్యూజికల్ మేజిక్ సృష్టిస్తారో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ – కీప్ వాచింగ్ ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *