హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో పీజీఆర్ గారిని “నాన్ లోకల్” అని వ్యాఖ్యానించడంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనకు దారి తీశాయి.
టిజీఆర్ గారి అభిమానులు, తెలంగాణా నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నవీన్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు.
వారు పేర్కొంటూ – “పీజీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆరాధనీయ నాయకుడు. ఆయనను ‘నాన్ లోకల్’గా అభివర్ణించడం బాధాకరం. రాహుల్ గాంధీ యూపీ నుంచి వచ్చి కేరళలో పోటీ చేసినట్టే, భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా నిలబడవచ్చు, గెలవవచ్చు. ఈ దేశంలో లోకల్ – నాన్ లోకల్ అనే భేదం ఉండకూడదు” అని అన్నారు.
నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహం రేపగా, రాజకీయ నేతలు ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, ప్రజల ముందర క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

