బాలానగర్ భూముల కుంభకోణం: ప్రభుత్వానికి ₹3 కోట్లు, బంధుమిత్రులకు ₹30 కోట్లు?

బాలానగర్ ప్రాంతంలో భూముల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు గజం ధర లక్షా యాభై వేల రూపాయలు వరకు ఉంది. అయితే ప్రభుత్వ విధానాల పేరుతో భూములను అతి తక్కువ ధరకు కొంతమందికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం బాలానగర్‌లో ఎకరానికి కేవలం ₹10,000 మార్కెట్ వాల్యూ చూపించి, అదిలో 30% మాత్రమే అంటే కేవలం ₹3,000 చెల్లిస్తే చాలు, భూమి వారిది అవుతుంది అనే విధంగా స్కీమ్ సిద్ధం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ HILT పాలసీ కేవలం అభివృద్ధి పేరుతో ఉన్నప్పటికీ, అసలు లక్ష్యం మాత్రం భూముల దోపిడీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎకరానికి అసలు లెక్క ఇలా ఉంది👇

అంశంమొత్తం
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం₹3 కోట్లు
బంధుమిత్రులకు, ప్రభావశీలులకు వచ్చే లాభం₹30 కోట్లు
మార్కెట్లో విలువ₹50–₹100 కోట్లు వరకు

సాధారణ ప్రజలు ప్రభుత్వ భూమిలో చిన్న ఇల్లు, గుడిసె నిర్మించుకున్నా, వారిని అనాగరికంగా బలవంతంగా తొలగిస్తారు. కానీ అదే భూమిని కోట్లలో ఉన్న విలువను తక్కువగా చూపించి కొందరికి కేటాయించడమే ఈ స్కామ్ ఉద్దేశమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *