జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటింగ్ కొనసాగుతుండగా, ఓటర్ల అభిప్రాయాలు, పోలింగ్ టెండెన్సీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రతి డివిజన్ వారీగా చూసినప్పుడు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ 47% ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 43%, బీజేపీ 8%, ఇతరులు 2% ఉన్నారు. షేక్పేట్లో మాత్రం కాంగ్రెస్ 48% తో ముందంజలో ఉండగా, బీఆర్ఎస్ 45%, బీజేపీ 5% గా నమోదయ్యాయి.
వెంగళరావు నగర్లో కాంగ్రెస్ 45%, బీఆర్ఎస్ 43%, బీజేపీ 8.5% గా ఉంది. బోరబండలో బీఆర్ఎస్ ఆధిక్యం చూపిస్తోంది — 47% ఓట్లు బీఆర్ఎస్కు, 43% కాంగ్రెస్కు, బీజేపీకి 7.5%. రహమత్నగర్లో మాత్రం ముస్లిం ఓటర్ల మద్దతుతో కాంగ్రెస్ 48% సాధించగా, బీఆర్ఎస్ 44%, బీజేపీ 6% వద్ద ఉంది.
శ్రీనగర్ కాలనీలో 47% బీఆర్ఎస్, 43% కాంగ్రెస్ ఓట్లు నమోదు అయ్యాయి. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 46.5%, కాంగ్రెస్ 42.5% మధ్య కేవలం 4 శాతం తేడా మాత్రమే ఉంది. ఇది ఎన్నికను గట్టి పోటీ దిశగా నడిపిస్తోంది.
విశ్లేషకుల అంచనా ప్రకారం — చివరి నిమిషం ఓటింగ్ ధోరణి, పబ్లిక్ మూడ్ మార్పులు, “ఫేక్ ఓట్లు” మరియు “రిగ్గింగ్ ఆరోపణలు” ఫలితంపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలు చివరికి ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి. ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం నాటికి ఈ ఉత్కంఠపై కొంత స్పష్టత ఇవ్వనున్నాయి.

