బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలుకావడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ నేతల ఘాటు విమర్శలు
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం మరోసారి రాజకీయ కేంద్రబిందువుగా మారింది. దశాబ్దాలుగా బీసీ ఉద్యమంలో ఉన్న నేతలు, సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసులు, కమిషన్లు, కోర్టులు అంటూ సంవత్సరాలుగా ఈ అంశాన్ని కావాలని ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శివశంకర్, బాలగౌడు, కొండ లక్ష్మణ్ బాపూజీ వంటి ఉద్యమ నాయకుల కాలం నుంచి బీసీలు రిజర్వేషన్ కోసం పోరాడుతూనే ఉన్నారని నేతలు గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని…

