ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహారంపై తెలంగాణవాదుల ఆగ్రహం.. “హైదరాబాద్పై పెత్తనం అంగీకరించం” హెచ్చరిక
ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణ ఉద్యమవాదులు, సామాజిక కార్యకర్తలు ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కు వచ్చి తెలంగాణకు చెందిన మేధావులపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నించడం అంగీకరించబోమంటూ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఒక తెలంగాణ ఉద్యమకారుడు మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్లేషకుడని, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మేధావి అని అన్నారు. “ఆయనపై ఆంధ్ర పోలీసులు వచ్చి చర్యలు తీసుకుంటామని మాట్లాడటం…

