నకిలీ ఫోన్పే రసీదుతో గొర్రెల వ్యాపారికి టోకరా.. హైదరాబాద్లో ఆరుగురు అరెస్ట్
హైదరాబాద్: డిజిటల్ చెల్లింపుల యుగంలో మోసగాళ్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెల కొనుగోలు పేరుతో ఓ వ్యాపారిని నకిలీ ఫోన్పే రసీదుతో మోసం చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం ఆరుగురిని కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్న టీ దుకాణం నుంచి కోట్ల రూపాయల వ్యాపారాల వరకు యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలో…

