రాహుల్ బంధు కాదు… రైతు బంధు కావాలి”: బడ్జెట్ సమావేశాల ముందు బీఆర్ఎస్ ఆందోళన

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. “రాహుల్ బంధు కాదు… రైతు బంధు కావాలి” అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని…

Read More

దేవాదుల ప్రాజెక్టు ఆలస్యం… వరంగల్ రైతులకు నష్టం? సీఎం పర్యటనపై తీవ్ర విమర్శలు

దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 2026 మార్చి 31 నాటికి జిల్లాలోని రైతులందరికీ సాగునీటి సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన హామీలపై ఇప్పుడు రాజకీయ వివాదం ముదురుతోంది. గోదావరి నది తీరంలో జరిగిన సమీక్షలో ప్రకటించిన నిర్ణయాన్ని అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించినప్పటికీ ప్రాజెక్టు పురోగతిపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు ప్రాణాధారంగా భావించే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పర్యటన…

Read More

ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆపండి, పాలనపై దృష్టి పెట్టండి: కేటీఆర్–హరీష్ రావులకు మద్దతుగా బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా గమనిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, విలువైన కాలాన్ని విచారణలు, నోటీసులు, రాజకీయ డ్రామాలతో ప్రభుత్వం వృథా చేస్తోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చిన తరువాత, తదుపరి కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం సాగుతోందని, ఇది పూర్తిగా భయభ్రాంతులు సృష్టించడానికి చేసిన ప్రయత్నమేనని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పేరిట…

Read More

ప్రతిపక్ష గొంతు నొక్కేలా శాసనసభ నడుస్తోంది – స్పీకర్, సీఎం వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ బహిష్కరణ

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు శాసనసభలో వినిపించాలని ఆశతో ఎదురు చూస్తుంటారని, ఆ బాధ్యతను ప్రతిపక్షం ద్వారా నెరవేర్చాలని అనేక వర్గాల ప్రజలు వినతులు ఇస్తుంటారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. అయితే ప్రజల గొంతును అసెంబ్లీలో ప్రతిధ్వనింపజేయాల్సిన శాసనసభ రోజు రోజుకు దిగజారిపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పక్క రాష్ట్రాల శాసనసభల తీరును చూసి మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తోందని గర్వపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష గొంతు నొక్కుతూ అధికార…

Read More