బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయాలి.. అసెంబ్లీలో అధికారపక్షం డిమాండ్
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై అధికారపక్షం తీవ్రస్థాయిలో మండిపడింది. సభా సంప్రదాయాలను ఉల్లంఘించేలా, మహిళలను అవమానించేలా, స్పీకర్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గత ఘటనలను ప్రస్తావించిన అధికారపక్షం సభలో మాట్లాడిన అధికారపక్ష సభ్యులు.. గతంలో బీఆర్ఎస్ హయాంలో దళిత, గిరిజన నాయకులకు అవమానం జరిగిందంటూ పలు ఆరోపణలు చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి రవీంద్ర నాయక్, రాములు…

