సలహాదారుల జీతాల పంచాయతీ.. ప్రజా హామీలు పక్కన పెట్టారా?
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రజా సమస్యల కంటే పదవులు, ప్రోటోకాల్లు, జీతభత్యాల గురించే ఎక్కువ చర్చ జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. కొందరు సలహాదారులు తమకు క్యాబినెట్ హోదా ఇవ్వలేదని, మంత్రులతో సమానమైన ప్రోటోకాల్ కల్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోయినా పెద్దగా ప్రశ్నించని నాయకులు, ఇప్పుడు తమ పదవులు, జీతాలు, భద్రత,…

