హార్వర్డ్ నుంచి లీడర్షిప్ సర్టిఫికేట్: సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్య విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్‌లో “లీడర్షిప్ ఇన్ 21వ శతాబ్దం” కోర్స్ పూర్తి చేసి సర్టిఫికేట్ పొందడంపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వ్యంగ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత లీడర్‌గా ఎదిగానని నిరూపించుకోవాలన్న భావనతోనే ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లుగా విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తిచేసి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకున్నట్టుగా సీఎం ఫోటోలు కనిపిస్తున్నాయని, ఇకపై ఎవరైనా “నువ్వు లీడర్ కాదురా” అని అడిగితే ఈ సర్టిఫికేట్…

Read More

సీఎం ఆదేశాలు గాలికి వదిలేస్తున్న బ్యూరోక్రసీ? ఫీల్డ్ విజిట్లకు దూరంగా ఉన్న సెక్రటరీలు

హైదరాబాద్‌ను దాటి ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను రాష్ట్ర బ్యూరోక్రసీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైల్ క్లియరెన్స్‌లో నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి పర్యటనల లేమి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అన్ని శాఖల సెక్రటరీలు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు….

Read More

జిల్లాలు–మండలాల పునర్విభజన ఖాయం: జుడిషియల్ కమిషన్ ఏర్పాటు, 15 నుంచి 20 జిల్లాలపై ప్రభుత్వ ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్విభజన ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ ప్రక్రియ కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. 15 నుంచి 20 జిల్లాల వరకు అవకాశం ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్యను కనిష్టంగా 15 నుంచి గరిష్టంగా 20 జిల్లాల వరకు కుదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కో లోక్‌సభ…

Read More

పెన్షనర్లను చంపకండి… బతకనీయండి”: 20 నెలలుగా 20 వేల కోట్లు బకాయి – పెన్షన్ జేఏసి ఆగ్రహం

తెలంగాణలో పెన్షనర్ల సమస్యలు తీవ్రమైన దశకు చేరుకున్నాయి. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా పెన్షన్ జేఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 నెలలుగా సుమారు ₹20,000 కోట్లు బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పెన్షనర్ల జేఏసి చైర్మన్ కే. లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు. 🔹 “సీఎం గారు… మమ్మల్ని చంపకండి, బతకనీయండి” ఇందిరా పార్కులో జరిగిన పెన్షనర్ల మహాధరణలో మాట్లాడిన కే. లక్ష్మయ్య అన్నారు: “ఏడాదిన్నర దాటినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.మేము దాచుకున్న డబ్బులే…

Read More

సినీ కార్మికుల కృషిని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి – “గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్”తో తెలుగు పరిశ్రమకు కొత్త గౌరవం

తెలుగు సినీ పరిశ్రమ పునాది వేయడంలో సినీ కార్మికుల కృషి అమోఘమని, వారి త్యాగమే ఈ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సినీ కార్మికుల సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని, “మీ కష్టం లేకుండా ఈ తెలుగు సినిమా పరిశ్రమ ఉండేది కాదు” అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “తెలుగు సినిమా పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, అన్న నందమూరి…

Read More

సచివాలయంలో ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం – నిర్లక్ష్యంపై వేటు సిద్దం

సచివాలయంలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం, సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ “పనితీరు లేని అధికారులను ఇక సహించం” అని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన ఫైళ్లను వారాల తరబడి పెండింగ్‌లో ఉంచడం, కాంట్రాక్ట్ పనులకు సంబంధించి నిర్ణయాలు ఆలస్యం…

Read More