రైతుల సంక్షేమమే లక్ష్యం.. రాజకీయాల కోసం రైతుల చావులపై రాజకీయం చేయొద్దు
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ప్రభావాలు, హమాలీల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. 45 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇప్పటికే ధాన్యం సేకరించామని, మిగిలిన 20 శాతం కూడా ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని తెలిపింది. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేతలు, ఇప్పుడు రైతుల బాధలను…

