కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. కాంగ్రెస్కు కర్రకాచి వాత పెడతాం” – హుజూరాబాద్ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో హుజూరాబాద్లో జరిగిన అభివృద్ధి అంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. బైఎన్నికల సమయంలో హరీశ్ రావు ఇన్చార్జ్గా వ్యవహరిస్తూ రోడ్లు, గుడులు, బడులు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా నియోజకవర్గానికి కనీస నిధులు…

