తెలంగాణలో ఇంటింటికి ఓటర్ సర్వే ప్రారంభం.. BLO ఇంటికి వస్తే ఏం చేయాలి? SIRపై పూర్తి వివరాలు

తెలంగాణ ప్రజలకు ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తారు. SIR అంటే ఏమిటి? SIR (Special Intensive Revision) అంటే ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి అందులోని తప్పులను సరిదిద్దడం, కొత్తగా అర్హత పొందిన వారికి ఓటు హక్కు కల్పించడం,…

Read Full News

రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు

రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వివాదం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక సీటు గెలిచే సంఖ్యాబలం ఉన్నప్పటికీ, బీజేపీ మూడో అభ్యర్థిని ఎందుకు బరిలోకి…

Read Full News

ఎంపిటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు వాయిదా?.. వర్షాకాలం తర్వాతే నిర్వహణకు అవకాశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత లేకపోయినా, ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపిటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు వర్షాకాలం తర్వాతే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగనుండడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాని అమలుపై దృష్టి పెట్టింది. దీంతో సమీప కాలంలో ఎన్నికల నిర్వహణ కష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఓటర్…

Read Full News

సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం: ఓట్ చోరీపై కాంగ్రెస్ మెగా ర్యాలీ, ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే పోరాడి నరేంద్ర మోదీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో మాత్రం సత్యం, అహింస ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓట్ చోరీ – గద్దీ చోడ్”…

Read Full News