“రైతులు చనిపోలేదనడం దుర్మార్గం”.. ధాన్యం కేంద్రాల వద్ద మరణాలపై మండిపడ్డ బిఆర్ఎస్
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర వివాదంగా మారుతున్న వేళ రైతుల మరణాల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. “రైతులు ఎక్కడా చనిపోలేదు” అని ప్రభుత్వం తరఫున వచ్చిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైతుల మరణాలను పూర్తిగా ఖండించడం, అవి జరగలేదని చెప్పడం అత్యంత దుర్మార్గమైన వ్యాఖ్యలని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు, జిల్లాల వారీగా నమోదైన…

