అక్రమాలకు చెక్‌.. ఒకే గొడుగు కింద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్? అవినీతి తగ్గాలంటే అధికారులు మారాలా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. రాష్ట్రంలో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సివిల్ సప్లైస్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల్లో ప్రస్తుతం విడివిడిగా పనిచేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూడు శాఖల్లో విజిలెన్స్ వ్యవస్థలు వేర్వేరుగా…

Read Full News

అమీర్‌పేట్ అగ్నిప్రమాదంపై ఆగ్రహం.. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్

హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో బాధిత వ్యాపారులను పరామర్శించిన పలువురు నాయకులు, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారి వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఆకస్మికంగా జరిగినది కాదని, గత ఏడాది నుంచి భవనంలోని కొన్ని దుకాణాల యజమానులు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. భవనం…

Read Full News

నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఘోర అగ్నిప్రమాదం: ఐదుగురు మృతిఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై రేపటి నుంచి కఠిన చర్యలు

హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఈ నెల 24వ తేదీ శనివారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచింది. ఒక ఫర్నిచర్ షాప్‌కు సంబంధించిన భవనంలోని సెల్లార్లలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన ఫర్నిచర్, కుర్చీలు, ఫోమ్, స్పాంజ్ వంటి అత్యంత జ్వలనశీల పదార్థాలు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో బయటకు రావడానికి అవకాశం లేక ఐదుగురు దుర్మరణం చెందారు. సెల్లార్లలో వేల సంఖ్యలో ఫర్నిచర్ సామగ్రిని అక్రమంగా నిల్వ చేయడం, ఫైర్…

Read Full News