హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. లక్షలాది మంది భక్తుల రద్దీ, భారీ ఏర్పాట్లు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆస్తమా బాధితులు, భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమం సాయంత్రం ప్రారంభమై మరుసటి రోజు రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగనుంది….

