హార్వార్డ్‌లో సీఎం ఖరీదైన చదువులు… గురుకులాల్లో పాముకాట్లు: విద్యాశాఖ వైఫల్యంపై హరీష్ రావు ఘాటు విమర్శలు

తెలంగాణలో గురుకుల విద్యార్థుల దయనీయ పరిస్థితిపై మాజీ మంత్రి టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురైన ఘటనపై స్పందించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హార్వార్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తుంటే, ఇక్కడ గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులు పాముకాట్లతో, కుక్కకాట్లతో ఆసుపత్రుల పాలవుతున్నారని హరీష్ రావు ఎక్స్…

Read More

మధ్యాహ్న భోజనంలో ఘోర నిర్లక్ష్యం: సంగారెడ్డి ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో అందించిన మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంను కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి “వికటించిన మధ్యాహ్న భోజనం – 22 మంది విద్యార్థులు అస్వస్థ” అనే శీర్షికతో దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హెచ్ఆర్సీ జుడిషియల్ సభ్యులు…

Read More

విద్య పేరుతో మరో 30 వేల కోట్ల అప్పా? మూడో విడత పంచాయతీ పోలింగ్ నడుమ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్రానికి 30 వేల కోట్ల రూపాయల రుణం అవసరమని కేంద్రాన్ని కోరినట్లు ఈరోజు పలు పత్రికల్లో ప్రధాన వార్తగా ప్రచురితమైంది. అదే సమయంలో ఈరోజు (17వ తేదీ) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగడం రాజకీయంగా కీలక ఘట్టంగా మారింది. ఇప్పటికే జరిగిన తొలి రెండు విడతల పోలింగ్‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను కైవసం చేసుకున్న నేపథ్యంలో,…

Read More