రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. “మా డబ్బులే ఇవ్వట్లేదు, ప్రభుత్వం చిట్ఫండ్లా వ్యవహరిస్తోంది”
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రిటైర్మెంట్ అనంతరం నెలల తరబడి తమకు రావాల్సిన జీపీఎఫ్, లీవ్ ఎన్క్యాష్మెంట్, పీఆర్సీ అరియర్స్, గ్రాట్యుటీ తదితర బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయల సాధన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవదాసు మాట్లాడుతూ, “నేను ఏప్రిల్ 2025లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. జూన్లోనే అన్ని బిల్లులు…

