కరీంనగర్లో పొలిటికల్ హీట్: కేసీఆర్ – రేవంత్ రెడ్డి పోటాపోటీ సభలు
తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఒకవైపు ఎండలు మండుతుండగా మరోవైపు రాజకీయ హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈరోజు రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే రోజు, ఒకే సమయంలో పోటాపోటీగా సభలు నిర్వహించేందుకు సిద్ధమవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంథని నియోజకవర్గంలో పర్యటిస్తూ ముందుగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. అనంతరం కాటారం మండలంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ పర్యటన…

