మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై బెదిరింపులు, డబ్బుల ప్రలోభాలు: పోలీసు అధికారుల జోక్యంపై నోముల భగత్ తీవ్ర ఆరోపణలు
నల్గొండ జిల్లా హాలియా–నందికొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారుల సహకారంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఆయన కుమారులు జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి డబ్బుల మూటలతో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రలోభ పెట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో డ్యూటీ లేకున్నా డీఎస్పీ సైదిరెడ్డి అర్ధరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లకు…

