పైరవీలకే ప్రాధాన్యం? ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసహనం, కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత చర్చ
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి Revanth Reddy అసంతృప్తిగా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కంటే వ్యక్తిగత ప్రయోజనాలు, పైరవీలపైనే కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ దృష్టి పెడుతున్నారని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలను ప్రస్తావిస్తూ వినతిపత్రాలు అందజేస్తుంటారు. అయితే కాంగ్రెస్లోని కొందరు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల కంటే భూమి…

