హైదరాబాద్ వాసులకు అలర్ట్: మంజీరా ప్రధాన పైప్లైన్ లీకేజీ.. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం”
హైదరాబాద్: నగర ప్రజలకు హైదరాబాద్ జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రాబోయే కొన్ని గంటల పాటు తాగునీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని సూచించింది. నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్లైన్లో భారీ లీకేజీ ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామం సమీపంలో కల్బుగూర్ నుంచి పటాన్చెరువుకు నీటిని తరలించే 1500 మిల్లీమీటర్ల వ్యాసం…

