ఫిబ్రవరి 14న మళ్లీ థియేటర్లలోకి ‘మనసంతా నువ్వే’: ఉదయ్కిరణ్ మేనల్లుడు తేజ భావోద్వేగ విజ్ఞప్తి
తెలుగు సినీ అభిమానులకు నోస్టాల్జియాను మళ్లీ తెరపైకి తీసుకొస్తూ, ఉదయ్కిరణ్ నటించిన క్లాసిక్ రొమాంటిక్ చిత్రం ‘మనసంతా నువ్వే’ ఫిబ్రవరి 14న తిరిగి థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఉదయ్కిరణ్ మేనల్లుడు తేజ మీడియాతో మాట్లాడి తన ఆనందాన్ని పంచుకున్నారు. “నా పేరు తేజ. నేను ఉదయ్కిరణ్ మేనల్లుడిని. దాదాపు 25 ఏళ్ల తర్వాత మా మామ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ…

