సీఎం రేవంత్పై బీఆర్ఎస్ ఫైర్.. కేసీఆర్ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్న శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. సనత్నగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, ప్రస్తుతం మాత్రం రాష్ట్రం మళ్లీ సమస్యల బాట పట్టిందన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గురుకుల…

