ముఖ్యమంత్రి స్థాయిలో గన్‌మన్‌పై దాడి దారుణం – కాంగ్రెస్ నేతల తీరు తీవ్ర విమర్శలపాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌మన్‌పై చేయి చేసుకున్న ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారం చేతికి వచ్చాక ఆగ్రహం, అసహనం పెరిగి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యమంత్రి గన్‌మన్‌ను కొట్టడం ఏ రకమైన ఆనందమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఓడిపోయిన సర్పంచులు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న పరిస్థితులకు, ముఖ్యమంత్రి ప్రవర్తనే ప్రేరణగా…

Read More

మాటలే ఎక్కువ… పనులు శూన్యం? కేసీఆర్ ప్రసంగం, కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలు, సోషల్ మీడియా రాజకీయాల విశ్లేషణ

కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకారాలు – మాటల పండుగలే తప్ప, విషయమేమిటి? పలువురు సర్పంచులు, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని వరుసగా ప్రసంగాలు చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ తదితరులు వేదికలపై మాట్లాడారు. అయితే ఈ ప్రసంగాలన్నీ విన్న తర్వాత ప్రజల్లో కలిగిన ప్రధాన సందేహం ఒక్కటే – వాళ్లు నిజంగా ఏం మాట్లాడారు? ప్రజలకు…

Read More

వికారాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా

వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…

Read More

పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే: కేసీఆర్ ధీమాబీజేపీ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణుల్లో కౌంటర్ రాజకీయాలు

పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే గెలుపు ఖచ్చితంగా తమదేనని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బిఆర్ఎస్ వైపే ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ ఎల్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొని పార్టీ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, రాబోయే రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చ…

Read More

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్ల…

Read More

42% బీసీ రిజర్వేషన్లపై నిశ్శబ్దం.. ఎన్నికల హడావుడి ఎందుకు? తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటపై పార్లమెంట్లో కనీసం 20 నిమిషాల చర్చ కూడా జరగలేదని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అండగా ఉంటామని చెబుతున్నా, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. రాష్ట్రపతి తెలంగాణలో ఉన్న సమయంలోనైనా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించాల్సిందని…

Read More

పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికలకు నాంది: సీఎం రేవంత్ రెడ్డి

2029లో కూడా ఇదే రీతిలో ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం వెల్లడించారు. రెబెల్స్‌తో కలిపి మొత్తం 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్…

Read More

నేషనల్ హెరాల్డ్ నిరసనలు నుంచి ఎమ్మెల్యేల జంప్ డ్రామా వరకు.. సీఎం ప్రెస్‌మీట్‌పై పెరిగిన ప్రశ్నలు

ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు పలు కీలక మలుపులు తిరిగాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అభ్యంతరాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఆకస్మిక ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిన్న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఈడీ చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అదే సమయంలో…

Read More

విద్య పేరుతో మరో 30 వేల కోట్ల అప్పా? మూడో విడత పంచాయతీ పోలింగ్ నడుమ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్రానికి 30 వేల కోట్ల రూపాయల రుణం అవసరమని కేంద్రాన్ని కోరినట్లు ఈరోజు పలు పత్రికల్లో ప్రధాన వార్తగా ప్రచురితమైంది. అదే సమయంలో ఈరోజు (17వ తేదీ) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగడం రాజకీయంగా కీలక ఘట్టంగా మారింది. ఇప్పటికే జరిగిన తొలి రెండు విడతల పోలింగ్‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను కైవసం చేసుకున్న నేపథ్యంలో,…

Read More

రెండేళ్ల పాలన విజయాలపై అసెంబ్లీ చర్చా? సీఎం రేవంత్ ఆలోచనలపై ప్రశ్నలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే “రెండేళ్ల పాలన విజయాలు” అన్న మాట వినగానే ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు సంవత్సరాల్లో నిజంగా ఏం సాధించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్‌బాల్ ఈవెంట్లు…

Read More