తెలంగాణ నా దేశంలో భాగం.. ద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలి: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణపై తనకు అపారమైన ప్రేమ ఉందని, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ప్రజల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan అన్నారు. తన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా అర్థం చేసుకోవద్దని స్పష్టం చేసిన ఆయన, “తెలంగాణ 100 శాతం ఇక్కడి ప్రజలదే. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే. దాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ తెలంగాణలోకి రావద్దు, అడుగు పెట్టవద్దు అని చెప్పడం…

