పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపు.. మధ్యతరగతి ప్రేక్షకులపై అదనపు భారం?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ చిత్రాల విడుదల సందర్భంగా సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంపై చర్చ మొదలైంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 వరకు, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, ప్రీమియర్ షోలకు ప్రత్యేక ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై పలువురు సినీ అభిమానులు, సామాజిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కుటుంబ సమేతంగా సినిమా చూడటం…

