22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…

Read More

మున్సిపల్ ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లపై రాజకీయ మౌనం: 56% టికెట్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం – బీసీ జేఏసీ హెచ్చరిక

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కావాలని పక్కదారి పట్టిస్తున్నారని బీసీ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. గంగపుత్ర సంఘం, బీసీ జేఏసీ, మహిళా సంఘాలు, వివిధ బీసీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్న సమావేశంలో ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన బీసీ జేఏసీ నేతలు, తెలంగాణలో జరిగిన కులగణన ప్రకారం బీసీలు 56 శాతం జనాభా ఉన్నప్పటికీ, మున్సిపల్…

Read More

ఆ హీరోయిన్‌కు కేటీఆర్ వంద కోట్లు ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ (పీసీపీ) నాయకుడు గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. గజ్జెల కాంతం మాట్లాడుతూ, 2022 జనవరి 24న ఓ కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని ఖాతాల నుంచి ఓ హీరోయిన్‌కు కేటీఆర్ రూ.100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఆ డబ్బు మూలం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని…

Read More

యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్ను.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా ప్రభుత్వ వ్యవహారం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను తలపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీల అభివృద్ధి కంటే భూములు లాక్కోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని మండిపడ్డారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్నేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రెండున్నరేళ్లలో మారిపోతుందని, ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ విస్తరణకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే…

Read More

రాహుల్ గాంధీ – రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. దిగజారుతున్న రాజకీయ భాషపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత దిగజారుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణపైకి “వదిలాడ”ని వ్యాఖ్యానించిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ అశోక్ నగర్ సభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని…

Read More

నేషనల్ హెరాల్డ్ కేసు: ఈడీని ఆయుధంగా మార్చి ప్రతిపక్షాలపై దాడి – బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

నేషనల్ హెరాల్డ్ కేసును కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీతో మాట్లాడిన కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్, బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పెట్టిన ఈడీ కేసులను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో, ఆ విషయాన్ని దేశ…

Read More

నేషనల్ హెరాల్డ్ కేస్: ఈడీ నోటీసులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు – బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

నేషనల్ హెరాల్డ్ కేస్ నేపథ్యంలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై స్పందిస్తూ, ఇది ఇక్కడితో ఆగేది కాదని, ముందు ముందు పోరాటం మరింత ఉధృతమవుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మార్చుకుని ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దేశం మొత్తం…

Read More

నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ డైవర్షన్ మాత్రమే – కోర్టుల తీర్పులను గౌరవించని బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

నేషనల్ హెరాల్డ్ కేసులో అసలు నిజం ఏమీ లేదని, కోర్టులు ఇప్పటికే ఎన్నిసార్లు ఈ కేసును కొట్టివేసిన విషయాన్ని బీజేపీ కావాలనే విస్మరిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాని ఒక కేసును మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నమే ఇది అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, దాన్ని డైవర్ట్ చేయడానికి నేషనల్ హెరాల్డ్ కేసును మోడీ,…

Read More

సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం: ఓట్ చోరీపై కాంగ్రెస్ మెగా ర్యాలీ, ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే పోరాడి నరేంద్ర మోదీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో మాత్రం సత్యం, అహింస ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓట్ చోరీ – గద్దీ చోడ్”…

Read More

ఉప్పల్‌లో మెస్సీ సందడి: గ్లోబల్ ఇమేజ్ పేరుతో ప్రజాధన దుర్వినియోగమా?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రావడంతో రాష్ట్రంలో ఫుట్‌బాల్ ఫీవర్ నెలకొంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఈవెంట్‌ను చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కత్తా పర్యటన అనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అక్కడి నుంచి తాజ్ ఫలక్నామా ప్యాలెస్‌లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ ఈవెంట్ చుట్టూ ఉత్సాహంతో పాటు తీవ్ర వివాదం కూడా చెలరేగింది. మెస్సీతో సెల్ఫీ దిగాలంటే ఒక్కొక్కరికి…

Read More