2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం వాటా సాధించాలి – సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి తెలంగాణ కూడా కీలకంగా దోహదపడాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో కనీసం 10 శాతం వాటాను తెలంగాణ నుంచి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, తెలంగాణను కేవలం పెట్టుబడులకు గమ్యస్థానంగా కాకుండా ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు….

Read Full News

మంత్రి పదవిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ గురి?.. కాంగ్రెస్‌లో విస్తరణ ఊహాగానాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ Gaddam Prasad Kumar ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhiను కలవడం ఆసక్తికరంగా మారింది. దీంతో త్వరలో జరగనున్న క్యాబినెట్ విస్తరణలో గడ్డం ప్రసాద్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ మంత్రి పదవిని ఆశించినప్పటికీ, సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు….

Read Full News

ఇంటర్ బోర్డు అవకతవకలపై హైకోర్టు ఆగ్రహం – ప్రైవేట్ కళాశాలల దందాపై తీవ్ర వ్యాఖ్యలు

రాష్ట్ర ఇంటర్ బోర్డు వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వాలని ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను కూడా పాటించలేదని సంబంధిత అధికారులు, ముఖ్యంగా కొంతమంది IAS అధికారుల పనితీరుపై కోర్టు అసంతృప్తి తెలిపింది. ఈ నేపధ్యంలో ఇలంబర్తి మరియు ఆర్వి కర్ణన్‌కు నోటీసులు జారీ చేస్తూ, వచ్చే నెల 26లోగా వివరణ సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు, తెలంగాణలోని ప్రైవేట్ ఇంటర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అనుమతులు ఒకచోట…

Read Full News