పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు మళ్లీ తెరపైకి
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయవాదం, జాతీయవాదం అంశాలు చర్చనీయాంశంగా మారాయి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా, బీజేపీ నేతలు పవన్కు మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, దేశంలోని ఏ రాష్ట్ర పౌరుడైనా ఎక్కడైనా నివసించే హక్కు కలిగి ఉంటాడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తాను…

