భూముల భద్రతకు నామినల్ ‘రకం’ విధానం అవసరం.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి

భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, రికార్డుల భద్రత, రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించే అంశాలపై నామినల్ “రకం” విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో పటేల్–పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూములకు సంబంధించి రకం చెల్లించే విధానం ఉండేదని, ఆ వ్యవస్థ రద్దైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ పద్ధతి కొనసాగిందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం భూములకు సంబంధించి యాజమాన్య ఆధారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించేందుకు ఈ…

Read More

మీసేవ ఆపరేటర్లపై వేట… చలానా కుంభకోణం నేపథ్యంలో 632 మందికి షాక్

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో వెలుగులోకి వచ్చిన చలానా కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భూసంబంధిత సేవల్లో జరిగిన అవకతవకలపై విచారణ వేగవంతం చేస్తూ 632 మంది మీసేవ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. భూభారతి–ధరణి వ్యవస్థలో చలానాల అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 37 కేసులు నమోదు కాగా, సంబంధిత వ్యక్తులపై చర్యలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మీసేవ ఆపరేటర్లపై కఠిన…

Read More