తెలంగాణ బీజేపీ పతనం: పార్టీ మార్పులు, నిర్లక్ష్యం, నమ్మకం కోల్పోయిన నాయకత్వం
తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన పార్టీ, ఇప్పుడు అంతర్గత నిర్లక్ష్యం, నాయకత్వ వైఫల్యంతో తన స్థానం తానే కోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, బీజేపీలో చేరిన తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు, పదవులు రాకపోవడంతో తిరిగి సొంత గూటికే వెళ్లాలని…

